Friday, February 19, 2021

Kulasekhara Padi

                                                      కులశేఖర పడి 

వేంకటేశ్వర స్వామి మూలవిగ్రహం ఎదురుగా ఉండే గడప ను, "కులశేఖర పడి"(గడప) అంటారు.   తిరువాన్కూరు మహారాజు కులశేఖర ఆళ్వారు ని పేరు మీదుగాఈ గడపకు, ఈ  పేరు ఏర్పడింది.

   తిరువాన్కూరు(కేరళ) రాజ్యానికిమహారాజు కులశేఖరుడు . శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు. 

ముకుందమాల : ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో  రచించిభగవంతునికి అంకితం చేశారు. ఆ గ్రంథంలో వెంకటేశ్వర స్వామి తో. “నీ సన్నిధికి దేవతలు, అప్సరసలు, మహాభక్తులు ఎందరో వస్తారు, అటువంటి నీ సన్నిధిలో గడపగా ఉన్నా నా జన్మ తరించినట్లేనని”, తన కోరిక విన్నవించుకున్నారు, స్వామి తదాస్థు అన్నారు. తిరుమల లో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు.



No comments:

Post a Comment

దీనుఁడ నేను- దేవుఁడవు నీవు

దీనుఁడ నేను- దేవుఁడవు నీవు I am a humble person- You are God ...