Friday, September 29, 2023

మలయప్ప స్వామి దర్శనము, మాడ వీధులు , తిరుమల

 

                                       మలయప్ప స్వామి  దర్శనము, మాడ వీధులు , తిరుమల 

మలయప్ప స్వామి (శ్రీవారు ఉత్సవ విగ్రహాలు ) దర్శనము, మాడ వీధులు , తిరుమల : ప్రతి రోజు, సాయంత్రం, 6 గంటలకు , స్వామి వారు , సవ్య దిశలో, మాడ వీధులలో భక్తులకు దర్శనము ఇస్తారు. ”భాగ్‌ సవారి” ఉత్సవం, రోజున, స్వామివారు , అపసవ్య దిశలో దర్శనము ఇస్తారు .

శ్రీవారి ”భాగ్‌ సవారి” ఉత్సవం"

                                                      శ్రీవారి  ”భాగ్‌ సవారి” ఉత్సవం" 

         ”భాగ్‌ సవారి”  అంటే , శ్రీవారు  "తోటకు వేంచేయుట"  అని అర్ధము .  బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు,  ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం, ఆనవాయితీ.




         శ్రీవారు , అపసవ్య దిశ లో ,  అనంతాళ్వారు తోటకు వచ్చుట:    భాగ్‌ సవారి” ఉత్సవం  సందర్భముగా  శ్రీవారు , అపసవ్య దిశలో ,  అనంతాళ్వార్ తోట కు వస్తారు.  ప్రతి రోజు, సాయంత్రం   6 గంటలకు ,  స్వామి వారు , సవ్య దిశలో,  మాడ వీధులలో  భక్తులకు దర్శనము ఇస్తారు, ”భాగ్‌ సవారి” ఉత్సవం, రోజున, స్వామివారు , అపసవ్య  దిశలో  వస్తారు. 

       అనంతాళ్వారు, " శ్రీదేవిని ,  అశ్వత్త వృక్షానికి  బంధించుట" :   శ్రీవారు ,  శ్రీ అనంతాళ్వారు భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా,  అనంతాళ్వారు పూల తోటకు,  మానవ రూపంలో వచ్చారు  . అనంతాళ్వారు   పూల తోటలో,  పూలు కోస్తున్న అమ్మవారిని,  అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా, అపసవ్య ( అప్రదక్షణ) దిశలో పారిపోయి,  ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు. 

          శ్రీవారికి , మామ గారైన  అనంతాళ్వారు:  ఆలయంలో , స్వామి  వారు , పూజారులకు , భక్తులకు  " అనంతాళ్వారు, తోటలో అమ్మవారిని బందించాడని చెపుతారు . పూజారులు , భక్తులు  మేళతాళలతో  తోటకు చేరుకుంటారు.  అనంతాళ్వారు, అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. అనంతాళ్వారు,   "పూల బుట్టలో, అమ్మవారిని", తీసుకురావటం, చూసి , శ్రీవారు , "అనంతాళ్వారు ను మామ " అని పిలిచారు . 


        శ్రీవారు , " భాగ్ సవారి"  కి అభయమిచ్చుట:    అనంతాళ్వారు  భక్తికి మెచ్చి స్వామివారు , అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాలు మరునాడు,  తాను అనంతాళ్వారు తోటలోనికి అప్రదక్షణం గా విచ్చేసి తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభయమిచ్చారు. 

          నాళాయరా దివ్య ప్రబంధం: అనంతాళ్వారు తోటలో,  అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం  నిర్వహిస్తారు .  ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌ చిన్న‌జీయ‌ర్‌స్వామి, పేష్కార్, పార్‌ఫ‌తేదార్, శ్రీ‌వారి భక్తులు  పాల్గొంటారు.




     ”భాగ్‌సవారి” ఉత్సవం:   ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే,  ఈ ”భాగ్‌సవారి” ఉత్సవం,  స్వామివారు సాయంత్రం 4.30 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోకి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగుస్తుంది. 



      అనంతాళ్వారు తోట ( పురుశైవారి తోట),  శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉంటుంది. 

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...